బిగ్ బాస్ లో అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు!
on Dec 3, 2022
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందులో నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. అయితే వారం నుండి సాగుతున్న 'టికెట్ టు ఫినాలే' రేస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు రేపుతోంది. బిగ్ బాస్ ప్రతీసారి ఏకాభిప్రాయంతో ఒక్కో కంటెస్టెంట్ ని తప్పిస్తూ వస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో "ముగ్గురు మాత్రమే నెక్ట్ లెవెల్ కి వెళతారు. ఆ ముగ్గురు ఎవరో చెప్పండి" అని శ్రీసత్య, ఇనయా, కీర్తిభట్ లను బిగ్ బాస్ అడిగాడు. వారు రోహిత్, ఫైమా, రేవంత్ ని ఎంపిక చేసుకొన్నారు. అందుకు వాళ్ళు అంగీకరించకపోవడంతో శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డిలను నెక్స్ట్ లెవెల్ కి పంపించారు. వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కు పంపించే ప్రక్రియలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది.
కాగా హౌస్ లోని అబ్బాయిలు అంతా ఒక వైపు..అమ్మాయిలంతా ఇంకో వైపుగా అయ్యారు. ఎవరికి వారే విడిపోయి గ్రూప్ లుగా డిస్కస్ చేసుకోగా, హౌస్ మొత్తం రెండు టీంలు గా మారారు. రోహిత్, ఇనయాకి మధ్య ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరిగింది. మధ్యలో రేవంత్ కలుగచేసుకొని.. "రోహిత్ ఆడనని చెప్పినా వినకుండా బుజ్జగించి ఆడిస్తారా?" అని అడుగగా, "ఎవరిది సరైన నిర్ణయమో శనివారం రోజు నాగార్జున సర్ చెప్తారు" అని సమాధానమిచ్చింది ఇనయా.
అయితే బిగ్ బాస్ ఇచ్చిన 'సెరా' టాస్క్ లో కూడా అమ్మాయిలంతా ఒక వైపు, అబ్బాయిలంతా మరో వైపు ఉన్నారు. అందులో అమ్మాయిల టీం గెలిచి ప్రైజ్ మనీని గెలుచుకుంది.
Also Read